
ప్రపంచ చెస్ చాంపియన్ గా నిలిచి రికార్డ్ సృష్టించాడు భారత్ కు చెందిన గుకేశ్ దొమ్మరాజు. సింగపూర్లో జరిగిన చెస్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచాడు. చైనాకు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్తో గుకేశ్ ఫైనల్లో తలపడ్డాడు. 14వది, చివరిది అయిన గేమ్ లో డింగ్ ను ఓడించి టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. ఈ విజయంతో విశ్వనాథన్ ఆనంత్ తరువాత ప్రపంచ చాంపియన్ షిప్ సొంతం చేసుకున్న రెండో భారతీయుడిగా గుకేశ్ నిలిచాడు. 2012లో విశ్వనాథన్ ప్రపంచ చాంపియన్ అయ్యాడు.
ఆఖరి గేమ్కు ముందు, గుకేష్ డి మరియు డింగ్ లిరెన్ ఇద్దరూ 6.5 పాయింట్లతో సమంగా ఉన్నారు. ఆఖరి మ్యాచ్ కూడా డ్రా ఆవుతోందనుకున్నారంతా…అయితే చివర్లో డింగ్ లిరెన్ చేసిన పొరపాటును తనకు విజయవంతంగా ఉపయోగించుకున్నాడు. గేమ్ సొంతం చేసుకుని వరల్డ్ చాంపియన్ గా నిలిచాడు.
2024లో అద్భుత విజయాలు సాధించాడు గుకేశ్ . ఈ ఏడాది ఏప్రిల్లో క్యాండిడేట్స్ టోర్నమెంట్ లో డింగ్ లిరెన్తో తలపడి వరల్డ్ చాంపియన్ షిప్ మ్యాచ్ కు అర్హత సాధించాడు. ఆ పోటీలకు అర్హత పొందిన వాళ్లలో అతిపిన్న వయస్కుడు గుకేశ్.
ఇదే ఏడాది సెప్టెంబర్ లో బుడాపెస్ట్లో జరిగిన చెస్ ఒలింపియాడ్లో భారత జట్టు సభ్యుడిగా కూడా గుకేశ్ అద్భుతంగా రాణించి, వ్యక్తిగత బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అతని ఆటతీరుతో ఒలింపియాడ్స్లో భారత జట్టు తొలి బంగారు పతకాన్ని గెలుచుకుంది.














