• Home 2
  • Sample Page
  • దేవిక జర్నలిస్టు
Tuesday, July 21, 2026
Devika Journalist
No Result
View All Result
  • Login
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు
No Result
View All Result
Devika Journalist
No Result
View All Result
Home ప్రాంతీయం

బెనిఫిట్ షోలు రద్దు చేస్తే సరిపోతుందా?-తాజా ఘటనతోనైనా అభిమానులు ఆగుతారా?

Devika by Devika
December 7, 2024
in ప్రాంతీయం, సినిమా
0
బెనిఫిట్ షోలు రద్దు చేస్తే సరిపోతుందా?-తాజా ఘటనతోనైనా అభిమానులు ఆగుతారా?
0
SHARES
8
VIEWS
Share on FacebookShare on Twitter

READ ALSO

భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు

అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ


తెలంగాణలో ఇకనుంచి బెనిఫిట్ షోలు ఉండవని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. చనిపోయిన రేవతి కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం అందిస్తానని అల్లు అర్జున్ ప్రకటించాడు.


ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ లో జరిగిన విషాదం గురించి అందరికీ తెలిసిందే. ఆ రోజు అల్లు అర్జున్, దేవీశ్రీ ప్రసాద్ సడెన్ గా థియేటర్ కి వచ్చారు. అప్పటికే ఈ విషయం తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్… భారీగా గూమికూడారు. థియేటర్ లోపల బయట ఇసుక వేస్తే రాలనంత జనం. గేటు తెరవగానే జనం ఒక్కసారిగా లోపలకు దూసుకెళ్లారు. తోపులాటలో కొందరు కిందపడిపోయారు. అక్కడున్న పోలీసులు కొందరికి సీపీఆర్ సహా ఇతర సపర్యలు చేయటం మొదలుపెట్టారు. ఆ తొక్కిసలాటలోనే రేవతి, ఆమెతో పాటే ఉన్న కొడుకు పడిపోయారు. రేవతి అక్కడే ప్రాణాలు వదలగా..అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయిన ఆమె కుమారుడు శ్రీతేజను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బాలుడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.


ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. ఏమాత్రం ప్రణాళిక లేకపోవడం వల్లే ఫ్యాన్స్ ప్రాణాలమీదకు వచ్చిందని విమర్శలు వచ్చాయి. ప్రివ్యూ గురించి, అల్లుఅర్జున్ రాక గురించి…సినిమా టీం నుంచి కానీ, థియేటర్ యాజమాన్యం నుంచి కానీ పోలీసులకు సమాచారం లేదు. అంతపెద్ద స్టార్ వస్తున్నాడంటే క్రౌడ్ ఉంటుంది. కానీ కంట్రోల్ చేయడానికి ధియేటర్ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అల్లు అర్జున్ లోపలకు వెళ్లి రావడానికి సెపరేట్ ఎంట్రీ, ఎగ్జిట్ లేవు. ఆయన లోపలకు వెళ్లగానే అందర్నీ అదే ద్వారం నుంచి వదిలారు. దీంతో హీరోను చూడాలంటే ఆరాటం, సీట్లు దొరకబుచ్చుకోవాలనే తొందరతో అందరూ ఒకేసారి దూసుకెళ్లారు. థియేటర్ కెపాసిటిని మించి జనం అందులోకి చేరారు. ఈ పరిస్థితుల్లో అల్లు అర్జున్ సెక్యూరిటీ స్టాఫ్ జనాన్ని ఇష్టం వచ్చినట్టు తోసినట్టు చెబుతున్నారు. అంతే తోపులాట,తొక్కిసలాట. కొందరికి శ్వాస అందలేదు. మరికొందరు ప్యానిక్ అయ్యారు. కిందపడిన రేవతి అక్కడే ప్రాణాలు వదిలింది.


అయితే ఇందులో థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ ది తప్పు ఉంది. ఎంతో క్రేజ్ తో రీలీజై… ఎప్పుడు కిటకిటలాడే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ కు రావలనుకోవటం ఆయన చేసిన తప్పు. ఒక వేళ రావాలనకున్న ఎలాంటి సమాచారం పోలీసులకు ఇవ్వలేదు. ప్రత్యేకంగా రావటానికి… పోవటానికి చర్యలు తీసుకోలేదు. కనీసం అక్కడున్న జనాల్ని అంచనా వేసి ముందుకు వెళ్లాల్సింది.


తెలుగువాళ్లకు సినిమా పిచ్చి కాస్త ఎక్కువే. గతంలోనూ సినిమా రిలీజ్ సందర్భంగా తొక్కిసలాటలు జరిగిన సంఘటనలున్నై. ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నై. 2003 లో రాజమండ్రి ఉర్వశి థియేటర్ లో చిరంజీవి ఠాగూర్ సినిమా రిలీజైన రోజు…టికెట్ కౌంటర్ దగ్గర తొక్కిసలాట జరిగి ఇద్దరు చనిపోయారు.2012 లో బిల్లా మూవీ రీలీజ్ అప్పుడు ఒకరు చనిపోయారు. 2017లో గోవిందుడు అందరివాడే సినిమా ప్రదర్శిస్తున్న కర్నూల్ థియేటర్ లో రామ్ చరణ్ ఫ్యాన్ ఒకరు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ మధ్య పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా రీలీజ్ అప్పుడు వైజాగ్ లో ఫ్యాన్స్ తోపులాటలో అద్దాలు ధ్వంసమయ్యాయి. వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ హనుమకొండలో జరిగినప్పుడు కూడా ఫ్యాన్స్ తోసుకొని కొంత మందికి గాయాలయ్యాయి. మహేశ్ బాబు గుంటురూ కారం ప్రీ రీలిజ్ ఈవెంట్ లో పోలీసులకు గాయాలయ్యాయి.


తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచే ఈ ఫ్యాన్స్ అతి చేష్టలున్నాయి. ఫాన్స్ అనే పేరుతో సినిమా రీలీజైన మొదటి రోజే చూసేయాలన్న ఆత్రం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పెద్ద సినిమాలు, క్రేజ్ ఉన్న నటుల సినిమాలు రీలీజైనప్పుడు యువతరం ఎగబడిపోతూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా టికెట్ ధరలు పట్టించుకోకుండా వేలం వెర్రిగా ప్రవర్తిస్తున్నారు. ఆర్మీలు, టీం లు, అసోసియేషన్ ల పేరుతో ఈ పిచ్చి కొనసాగుతోంది. కొన్నిసార్లు వారిస్తున్నా వినిపించుకోకుండా ప్రవర్తించే వాళ్ల వల్ల నటులకు చెడ్డ పేరు వస్తోంది. సినిమా కంటే ప్రాణం ఎంతో విలువైందన్న విషయాన్ని మరిచిపోతున్నారు. మొన్న జరిగిన ఘటనలో తల్లీ చనిపోవడం, కొడుకు ప్రాణాలతో పోరాడుతుండడం కలిచివేసింది. చనిపోయిన రేవతి కుటుంబం మొత్తం ఆ రోజు థియేటర్ కు వచ్చింది. యువత సరే..మహిళలు కూడా ఎగబడడం ఏంటి? అదీ అంత చిన్న పిల్లలను తీసుకురావల్సిన అవసరం ఏంటి? మొదటి రోజు మొదటి ఆటను అంత చిన్న పిల్లలకు చూపించాలా? చివరకు ఏమైంది?


యువతరం సినిమాని ఒక వినోద సాధనంగా చూడటం నేర్చుకోవాలి. కానీ ఫ్యానిజం పేరుతో ఎగబడుతున్నారు. వంద రూపాయల టికెట్ ను ఐదు పదింతలు పెట్టి కొంటున్నారు. స్వయంగా అల్లు అర్జునే డబ్బు విలువ గురించి చెప్తూ… ఏ వస్తువు ఎంత ధరో అంతే పే చేస్తాను తప్ప రూపాయిఎక్కువ ఖర్చు పెట్టను అన్నాడు. ఆ హీరోను అభిమానించే వాళ్లు అతని మాటలను మాత్రం ఎందుకు ఎక్కించుకోవడం లేదు.అల్లు అర్జున్ అన్న ఆ మాటలు ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.


సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్లలో, ఆడియో ఫంక్షన్లలో తొక్కిసలాటలు రిపీట్ అవుతూనే ఉన్నా…అటు ఇండస్ట్రీ జాగ్రత్త పడడం లేదు. ఇటు ప్రభుత్వాలూ చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం థియేటర్లలో క్రౌడ్ మేనేజ్ మెంట్ పై విధివిధానాల్ని ప్రకటించాలి. కెపాసిటిని మించి అనుమతించకుండా నియంత్రించగలగాలి. థియేటర్లలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ లు… గుర్తించే విధంగా సెపరేట్ గా ఉండాలి. డోర్లు చిన్నగా కాకుండా విశాలంగా ఉండాలి. ఇలాంటి ఈవెంట్ లకు ఎంత మంది వస్తారు… ఎలా వస్తారో ముందే ప్లాన్ చేయగలగాలి. క్రౌడ్ మేనేజ్ మెంట్ లో ట్రైన్ డ్ సిబ్బందిని నియమించుకోవాలి. స్థానిక పోలీసులు, ఇతర సంస్థలతో మూవీ టీం సంప్రదింపులు జరిపాకే ఈవెంట్లను నిర్వహించాలి. కేవలం బెనిఫిట్ షోలను బ్యాన్ చేయటం వల్ల సమస్య పరిష్కారం అవదు. ఎందుకంటే బెనిఫిట్ షో కాకపోతే ఆ సినిమా రీలీజైన మొదటి రోజు ఇదే పరిస్థితి ఉంటుంది. ఈ విషయంపై ఇండస్ట్రీ, ప్రభుత్వం ఆలోచించాలి.

Tags: allu arjun about revathi incidentallu arjun about sandhya theatre revathi incidentallu arjun emotional about revathipushpa 2 sandhya theatre incidentrevathi incidentsakshi tvsandhya theatre issuesandhya theatre revathi incident

Related Posts

భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు
జాతీయం

భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు-ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు

January 6, 2025
అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ
జాతీయం

అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

December 23, 2024
POW పిటిషన్లపై సుప్రీం విచారణ-నాలుగువారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం
అంతర్జాతీయం

POW పిటిషన్లపై సుప్రీం విచారణ-నాలుగువారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం

December 12, 2024
జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం-జమిలికి 32 పార్టీల అంగీకారం, 15 పార్టీల వ్యతిరేకం
జాతీయం

జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం-జమిలికి 32 పార్టీల అంగీకారం, 15 పార్టీల వ్యతిరేకం

December 12, 2024
క్రిస్మస్ పేరుతో 120 మిలియన్ల చెట్లు నరికివేస్తున్నారు తెలుసా?
అంతర్జాతీయం

క్రిస్మస్ పేరుతో 120 మిలియన్ల చెట్లు నరికివేస్తున్నారు తెలుసా?

December 9, 2024
కసబ్ విషయంలో భారత్ అలా,చిన్మయ్ విషయంలో బంగ్లాదేశ్ ఇలా:ప్రపంచం మొత్తం స్పందించాలి-ఎక్స్ వేదిగ్గా స్వరం పెంచిన పవన్ కల్యాణ్
అంతర్జాతీయం

కసబ్ విషయంలో భారత్ అలా,చిన్మయ్ విషయంలో బంగ్లాదేశ్ ఇలా:ప్రపంచం మొత్తం స్పందించాలి-ఎక్స్ వేదిగ్గా స్వరం పెంచిన పవన్ కల్యాణ్

December 7, 2024
Next Post
కసబ్ విషయంలో భారత్ అలా,చిన్మయ్ విషయంలో బంగ్లాదేశ్ ఇలా:ప్రపంచం మొత్తం స్పందించాలి-ఎక్స్ వేదిగ్గా స్వరం పెంచిన పవన్ కల్యాణ్

కసబ్ విషయంలో భారత్ అలా,చిన్మయ్ విషయంలో బంగ్లాదేశ్ ఇలా:ప్రపంచం మొత్తం స్పందించాలి-ఎక్స్ వేదిగ్గా స్వరం పెంచిన పవన్ కల్యాణ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR NEWS

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

మొన్న లక్ష చెట్లు నేలకూలినై…నేడు భూకంపం-ఏజెన్సీ జిల్లా ములుగులో వరుస విపత్తులకు కారణాలివేనా!

December 4, 2024
తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

తాజ్ మహల్ స్థలం నాదే-న్యాయపోరాటంలో గెలిచిన రైతు

November 5, 2024
వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

వీళ్లు కవితలా ఉందన్నారు, వాళ్లు గీతలా ఉందంటున్నారు-తెలంగాణలో విగ్రహ రాజకీయం

December 7, 2024
మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

మోదీవైపు ఆశగా, భారత్ వైపు నమ్మకంగా చూస్తున్నారు-కదిలించే కన్నీటి గాథ వాళ్లది

November 22, 2024
అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

అంబేద్కర్ పేరును వివాదంలోకి లాగి ఇరుకున పడిన రాహుల్-కాంగ్రెస్ పార్టీ

December 23, 2024

EDITOR'S PICK

డబ్బు , పేరు కోసం ఎంతకైనా దిగజారుతున్నారు…థు.. | Devika Journalist

డబ్బు , పేరు కోసం ఎంతకైనా దిగజారుతున్నారు…థు.. | Devika Journalist

November 22, 2025
స్వయం ప్రకటిత మేధావులకు సి* లేదు-ఇంకా రెచ్చగొడుతున్నారు| Devika Journalist

స్వయం ప్రకటిత మేధావులకు సి* లేదు-ఇంకా రెచ్చగొడుతున్నారు| Devika Journalist

August 17, 2025
వాళ్లకోసం ఎకరాలకు ఎకరాలు దొరికింది కానీ కాలేజీ కోసం మంచి జైలును కూల్చేశారు| Devika Journalist

వాళ్లకోసం ఎకరాలకు ఎకరాలు దొరికింది కానీ కాలేజీ కోసం మంచి జైలును కూల్చేశారు| Devika Journalist

August 7, 2025
పొట్టి ఉన్నికృష్ణన్  సోనియాను ఎందుకు కలిసినట్టు | Devika Journalist

పొట్టి ఉన్నికృష్ణన్ సోనియాను ఎందుకు కలిసినట్టు | Devika Journalist

January 4, 2026

About

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow us

Categories

  • Uncategorized
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • టూరిజం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • వీడియోలు
  • సినిమా

Recent Posts

  • గంగైకొండ చోళపురంలో ఉన్నా | | Devika Journalist | |
  • మోదీ కూడా అంతే!Melody khao khud jaan jao || Devika Journalist ||
  • 30 April 2026
  • నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు! ||Devika Journalist ||
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Social media & sharing icons powered by UltimatelySocial
No Result
View All Result
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ప్రాంతీయం
  • బిజినెస్
  • రాజకీయాలు
  • టూరిజం
  • సినిమా
  • వీడియోలు

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.